21-06-2025 12:00:00 AM
వనపర్తి టౌన్, జూన్ 20 : రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు చక చక జమ అవుతున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 16 నుండి రోజుకు కొంత మంది రైతులకు ఎకరాల చొప్పున రైతు భరోసా జమ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం నాడు వనపర్తి జిల్లాలో అయిదు ఎకరాల వరకు ఉన్న 11476 మంది రైతుల ఖాతాల్లో రూ. 30,05,62,758/- లు జమ చేసినట్లు తెలియజేశారు. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులు, ఇప్పటి వరకు రైతు భరోసా పొందని రైతులు సంబంధిత వ్యవసాయ విస్తీర్ణాధికారిని సంప్రదించాలని ఆయన ప్రకటన ద్వారా కోరారు.