25-06-2025 12:10:29 AM
గద్వాల టౌన్, జూన్ 24 : జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని వయావృద్ధుల సేవా కేంద్ర నిర్వహణ కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగుల & వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారిణి సునంద మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అటల్ వ యో అభ్యుదయ యోజన పథకం క్రింద (డే కేర్ సెంటర్) వయావృద్ధుల సేవా కేంద్ర ని ర్వహణ పని వేళలు ఆదివారం మినహా మిగతా అన్ని రోజులలో ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు నిర్వహించవలసి ఉంటుందన్నారు. ఇట్టి కేంద్ర నిర్వహణకు ఆసక్తి కలిగిన రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర స్వచ్ఛంద సంస్థలు మ రియు వయోవృద్ధుల సంక్షేమ సంఘం వారు ఎవరైనా ఈనెల 30వ తేదీ లోపు దరఖాస్తు దరఖాస్తు చేసుకోవాలన్నారు
దివ్యాంగుల ఉపకరణాల కోసం ఈనెల 27 వరకు పొడిగింపు
గద్వాల టౌన్, జూన్ 24 : దివ్యాంగులు ఉపకరణాల కొరకు దరఖాస్తు చేసుకొనుటకు చివరి తేదీ ఈ నెల వరకు పొడిగించ డం జరిగిందని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సునంద ఒక ప్రకటనలో తెలిపారు. కా వున జోగులాంబ గద్వాల జిల్లాలోని ది వ్యాంగుల అందరూ ఈ యొక్క సదవకాశా న్ని సద్వినియోగం చేసుకోగలరని ఆమె కోరారు అర్హులైన దివ్యాంగులు అందరూ http//tgobmms.cgg.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించగలరని సూచించారు.