25-06-2025 12:09:46 AM
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): రాష్ర్టంలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ ప్రక్రి య వేగంగా సాగుతోందని రాష్ర్ట రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 3లక్షల ఇండ్లు మంజూరు చేయగా ఇందులో 2.37 లక్షల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కూడా అందజేసినట్లు పేర్కొన్నారు.
1.03 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని, వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని మం త్రి తెలిపారు. మంగళవారం సచివాలయం లో ఇందిరమ్మ ఇండ్లపై సంబంధిత అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ర్టవ్యాప్తంగా రూ.22,500 కోట్లతో నియోజకవర్గానికి 3,500 చొప్పున 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
ఈ నెల 23వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) మినహా రాష్ర్టంలోని 95 నియోజకవ ర్గాలకుగాను 88 నియోజకవర్గాల్లో లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ పూర్తయిందని, వర్షా కాలం సీజన్ను దృష్టిలో పెట్టుకొని గ్రౌండిం గ్ అయిన ఇండ్లను వీలైనంత త్వరగా బేస్మెంట్ పనులు పూర్తి చేసుకునేలా నిరం తరం మానిటరింగ్ చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
ఇండ్ల మంజూరు, గ్రౌండింగ్లో సూర్యాపేట, పెద్దపల్లి, భూపాలపల్లి, హనుమకొండ, వికారాబాద్, సిద్ది పేట, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల పనితీరు మరింత మెరుగుపడాలని, తక్షణమే ఆయా జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఉచితంగా ఇసుక..
ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రభుత్వం ఒక్కో ఇంటి కోసం 40 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా అందిస్తోందని, ఈ ప్రయోజనా న్ని పూర్తిస్థాయిలో లబ్ధిదారులు పొందే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ర్ట ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏమా త్రం ఆలస్యం చేయకుండా ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిని బట్టి లబ్ధిదారులకు ప్రతీ సోమవారం చెల్లింపులు జరుపుతున్నామని తెలిపారు.
మధ్యవర్తుల ప్రమేయానికి ఆస్కా రం లేకుండా నాలుగు విడతల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జమచేస్తున్నామన్నారు. బేస్మెంట్ పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.1.25లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత 1.75 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత లక్ష రూపాయలు విడుదల చేస్తామన్నారు.
అసంపూర్తి ఇండ్లకు రూ.5 లక్షలు
ఇంటిస్థలాలు లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇప్పటివరకు కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించాలని, అలా గే మొండిగోడలతో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రానిపక్షంలో లబ్ధిదారులే పూర్తి చేసుకోవడానికి రూ.5లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వమే అందిస్తుందన్నారు.
ప్రధానంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసంపూర్తిగా ఉన్న జీహెచ్ఎంసీ, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.