12 May, 2026 | 12:09 PM

Breaking News

అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో విదేశీ ప్రతినిధులు   •   రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిస్వా శర్మ ప్రమాణస్వీకారం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు.. అన్నదాత కు అవగాహన   •   మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •  

ముఖ్యమంత్రి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు

17-03-2026 08:33 PM

నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండలం నర్మెట్ట లో 22న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.హేమావతి మంగళవారం పరిశీలించారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో హెలిప్యాడ్,బహిరంగ సభా వేదిక, రైతు మేళా స్టాళ్ల ఏర్పాటును వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, విజయ ఎం.డి చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ఆమె పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి పర్యటనలో ప్రోటోకాల్ పాటిస్తూ, ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు మేళాకు వచ్చే వేలాది మంది రైతులకు తాగునీరు, ఇతర కనీస వసతులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగు, యాంత్రీకరణ, పాడి పరిశ్రమపై రైతులకు అవగాహన కల్పించేలా స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్, ఉద్యానవన, పోలీస్, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు పాల్గొన్నారు.