12 May, 2026 | 10:55 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

గడువు ముగిసిన పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసిన వ్యక్తి అస్వస్థత

17-03-2026 08:28 PM

ఉప్పల్,(విజయక్రాంతి): గడువు ముగిసిన పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేసిన వ్యక్తి త్రీవ అస్వస్థతకు గురైన  సంఘటన  ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ అశోక్ నగర్ లో చోటుచేసుకుంది. గడువు ముగిసిన పెరుగువిక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న మిల్క్ బూత్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వివరాల్లోకెళ్తే  అశోక్ నగర్లో నివాసం ఉంటున్న గజేందర్  అశోక్ నగర్ లోని ఓ మిల్క్ షాప్ లో పెరుగును కొనుగోలు చేశారు.

తర్వాత ఇంటికెళ్లి పెరుగుతో భోజనం చేసిన తర్వాత వాంతులు విరోచనాలతో  కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు దగ్గరలోఉన్న ఆసుపత్రికి తరలించగా గడువు  ముగిసిన పెరుగు తాగడం వల్లనే గజేందర్ అస్వస్థత గురైనట్టు డాక్టర్లు తెలియజేశారు. పదేపదే గడువు ముగిసిన పాల ప్యాకెట్లు పెరుగు విక్రయిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అశోక్ నగర్ ప్రాంతంలోని నిత్యం కల్తి పాల పెరుగు అమ్మకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తనిఖీలు చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం వలన పాల బూతు యజమాన్యం విచ్చలవిడిగా గడువు పూర్తయినా కూడా పాలు పెరుగు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇదే పాల బూత్ నుండి పాలు పెరుగు కొనుగోలు చేసిన పలువురు అస్వస్థతకు  గురైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి పాల బూతులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.