07-06-2025 12:30:15 AM
యాదాద్రి భువనగిరి జూన్ 6 (విజయ క్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలేరు నియోజకవర్గం లో పర్యటిస్తున్న సందర్భంగా నిరసన తెలపడానికి ప్రయత్నించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని యాదగిరిగుట్టలో కాకుండా జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏర్పాటు చేయిస్తానని ప్రజలకు మాట ఇచ్చిన ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ప్రజలను మోసం చేశాడని టిఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
ముఖ్యమంత్రి యాదగిరిగుట్టలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తుండగా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే చేస్తున్నాడని ఆ పార్టీ నాయకులు ప్రశ్నించారు. అందుకు నిరసన కలపడానికి ప్రయత్నించిన టిఆర్ఎస్ నాయకులు ఏవి కిరణ్ కుమార్, ఆంజనేయులు, చింతల కిష్టయ్యలను ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.