07-06-2025 12:31:06 AM
ఉత్తర్వులు జారీ చేసిన ఎస్పీ
కామారెడ్డి, జూన్ 6 (విజయక్రాంతి): విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్న కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారులపై ఇబ్బందిపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చర్యలు తీసుకుంటున్నారు. విధులకు గైర్హాజరు, మద్యం సేవించి వాహనం నడిపినందులకు నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న యస్. రాకేశ్ గౌడ్ పై శుక్రవారం సస్పెషన్ వేటు వేశారు.
బాధ్యతారాహిత్య ప్రవర్తన, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, వెల్లడించారు. తాడ్వాయి పోలీసు స్టేషన్ పరిదిలో కానిస్టేబుల్ రాకేష్ గౌడ్ తన ద్వి చక్ర వాహనంతో ప్రమాదానికి గురవడముతో చెక్ చేయగా శ్వాస పరీక్షలో అధిక మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడం తో జిల్లా పోలీస్ అధికారి దృష్టికి తెచ్చారు.పోలీస్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన రాకేశ్ గౌడ్ పై సంబంధిత పోలీసు స్టేషన్ యస్ఐ నివేదిక పంపించారు.
ఈ నివేదిక ఆధారంగా, జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, యస్. రాకేశ్ గౌడ్, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ: ‘ పోలీసు శాఖలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. పోలీస్ ప్రవర్తన నియమావళికి వ్యతిరేకంగా ప్రవర్తించిన, ఉల్లంఘించిన వారిపై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చర్యలు పోలీస్ శాఖలోని వారు ఎవరు చేసిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదుఅని ఆయన హెచ్చరించారు.
గత మూడు రోజుల క్రితమే నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ ఒక కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తూ విధులు నిర్లక్ష్యం చేయడంతో జిల్లా ఎస్పీ సస్పెండ్ చేసిన మూడు రోజులకే మరో కానిస్టేబుల్ రాకేష్ గౌడ్ సస్పెన్ష ను కు గురి కావడం పోలీస్ శాఖలో సస్పెన్షన్ల భయం పట్టుకుంది. విధులు నిర్లక్ష్యం చేస్తున్న కానిస్టేబుల్ అధికారులు పద్ధతి మార్చుకోవాలని లేకుంటే సస్పెన్షన్ తప్పదని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు.