calender_icon.png 7 June, 2025 | 2:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

500పైన మార్కులు సాధించిన విద్యార్థినులకు సన్మానం

07-06-2025 12:28:32 AM

 బాన్సువాడ జూన్ 6 (విజయక్రాంతి) : మహమ్మద్ నగర్ మండలం కోమలంచ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం అందులో భాగంగా గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామసభలో కోమలంచ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ బాలచందర్ మాట్లాడుతూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని,ప్రవేట్ పాఠశాలల్లో చేర్పించద్దని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సదుపాయాలను వివరిస్తూ ప్రభుత్వ పాఠశాలకు మరియు ప్రైవేటు పాఠశాలకు తేడాను తెలియజేశారు.అనంతరం ఈ సంవత్సరంలో పదవ తరగతిలో 500 పైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు గ్రామ మాజీ సర్పంచ్ సాధన సత్యనారాయణ మొదటి బహుమతి వెయ్యి రూపాయలు, రెండో బహుమతి కింద ఇద్దరి విద్యార్థినులకు చెరో 500 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.

అనంతరం ఆ ముగ్గురు విద్యార్థినిలకు శాలువాతో సన్మానం చేసి, ఆ విద్యార్థినులకు త్రిబుల్ ఐటీ లో సీటు రావడానికి అహర్నిశలు కృషిచేసిన ఉపాధ్యాయ బృందానికి శాలువతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాజీ సర్పంచ్ సాధన సత్యనారాయణ, మాజీ సిడిసి చైర్మన్, బీ గంగారెడ్డి, బి.ఆర్.ఎస్ గ్రామ అధ్యక్షులు బలరాంరెడ్డి, నాగభూషణం గౌడ్, పోత గౌడ్, గ్రామ యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది.