28-06-2025 11:12:52 PM
కోదాడ: ఐదుగురు స్నేహితులు జల్సాలకు అలవాటు పడి గంజాయికి బానిసై డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ కార్యాలయంలో డిఎస్పి శ్రీధర్ రెడ్డి శనివారం తెలిపిన వివరాల ప్రకారం మూడవత్ అశోక్, కొత్తపల్లి నాగరాజు, నంబూరి రత్నాకర్ రెడ్డి, వేముల నాగరాజు, కేతవరపు సాయి, ఐదుగురు వ్యక్తులు అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు గ్రామానికి వెళ్లి అక్కడి గుర్తుతెలియని వ్యక్తుల నుండి ఐదు కేజీల గంజాయిని తీసుకొచ్చారని, ఆ గంజాయి దొండపాడు గ్రామంలోని బొడ్డు బసవయ్య కాలనీలో ఉన్న మధిర లక్ష్మీరెడ్డి నివాసంలో దాచి పెట్టారని తెలిపారు.
కేతవరపు సాయి తన దగ్గర ఉన్న రెండు కేజీల గంజాయితో తన బైక్ పై పారిపోయాడని, మిగిలిన నలుగురిని పట్టుకన్నామని తెలిపారు. వారి వద్ద నుండి ఒక స్కూటీ నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నేరస్తులను కోర్టులో హాజరు పరచడం జరిగిందనీ అన్నారు.కోదాడ రూరల్ సిఐ రజిత రెడ్డి, చింతలపాలెం ఎస్సై సందీప్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ లింగరాజు, కానిస్టేబుల్ భాస్కర్, అమృతయ్య, కవి రాజు, శ్రీకాంత్ లను డిఎస్పీ అభినందించారు.