28 June, 2026 | 1:56 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

తెలుసు కదా షురూ

07-08-2024 12:05 AM

‘టిల్లు స్క్వేర్’ సక్సెస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ తన నెక్స్ ప్రాజెక్ట్ ‘తెలుసు కదా’తో అలరించబోతున్నాడు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఇది 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్. ఇందులో టాకీ సీన్స్, మ్యూజిక్ నెంబర్స్ షూట్ చేస్తున్నారు. రాశీ ఖన్నా మొదటి రోజు షూటింగ్‌లో సిద్దూతో కలిసి జాయిన్ అయింది. ఈ చిత్రంలో శ్రీనిధిశెట్టి మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, వైవా హర్ష ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. సిద్దూ తన పాత్ర కోసం స్టైలిష్ మేకోవర్ అయ్యారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా ఉన్న ఈ ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, జ్ఞాన శేఖర్ బాబా సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.