28 June, 2026 | 1:47 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

సీఐ, ఎస్సై సస్పెన్షన్

28-06-2026 01:14 PM

జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా నర్మెట సిఐ అబ్బయ్యతో పాటు ప్రస్తుతం ఏఆర్ అటాచ్ లో ఉన్న ఎస్సై షేక్ హమీద్ ను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెండ్ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. బచ్చన్నపేటలో హమీద్ ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ కేసు విషయంలో సీఐ, ఎస్ఐలు అక్రమాలకు పాల్పడ్డట్టు ఫిర్యాదులు వచ్చాయి.

ఈ కేసు విషయంలో విచారణ జరిపిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎట్టకేలకు వీరిద్దరిపై వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు ఇద్దరూ ఒకే కేసులో సస్పెండ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పోచన్నపేట గ్రామానికి చెందిన ఓ కేసు విషయంలో వీరిద్దరిపై వేటుపడినట్లు చర్చ జరుగుతుంది.