17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

23-06-2025 01:37 AM

-గిరిజనులను కించపరిచేలా మాట్లాడారంటూ రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 22 (విజయక్రాంతి)/ శేరిలింగంపల్లి: సినీ నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హీరో సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో విజయ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు గిరిజన తెగల మనోభావాలను దెబ్బతీశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ వ్యాఖ్యలు గిరిజనులను అవమానించేలా, వారి సంస్కృతిని కించపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే  పలు గిరిజన సంఘాల నాయకులు ఆదివారం రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశారు.  ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.