17 April, 2026 | 11:55 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

యువతి విషయం.. తాగేసి బీరు సీసాలతో కొట్టుకున్న స్నేహితులు

09-06-2025 08:43 AM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా(Medchal Malkajgiri) కుత్బుల్లాపూర్‌ మండలంలో పుట్టినరోజు వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. యువతి విషయంలో నలుగురు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. యువతి గురించి మాట్లాడుకుంటున్న సమయంలో మాటా మాటా పెరిగి మద్యం మత్తులో బీరు సీసాలతో నలుగురు యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాడిలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీరుసీసాలతో దాడికి ప్రేమవ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.