calender_icon.png 16 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటో ట్రాలీ డ్రైవర్ అదృశ్యం

16-11-2025 04:52:03 PM

మిస్సింగ్ కేసు నమోదు

మందమర్రి (విజయక్రాంతి): పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన ఆటో ట్రాలీ డ్రైవర్ దేవి చంద్రయ్య అదృశ్యం అయ్యాడని ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13న పట్టణంలోని బురదగూడెం మదర్సా సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చిన ఆటో ట్రాలీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం నడుపుతున్న వోలపు నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాద స్థలం నుండి కొద్ది దూరంలో ఆటో ట్రాలీని వదిలిపెట్టిన డ్రైవర్ చంద్రయ్య అదే రోజు నుండి కనిపించక పోవడంతో, ఆయన కుటుంబ సభ్యులు బంధువులు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించ లేదు. డ్రైవర్ ఆచూకీ తెలిసిన వారు వెంటనే  8712656570 నెంబర్ కు, లేదా పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ మేరకు అతని బార్య దేవి భూలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.