17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సేవా భావంతో సమాజానికి మేలు చేయాలి..

16-11-2025 04:54 PM

ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంను ప్రారంభించిన అదనపు ఎస్పీ మహేందర్ 

పాపన్నపేట (విజయక్రాంతి): సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇతరులకు సహాయం చేయాలనే దృక్పథంతో ఉండాలని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ సూచించారు. పాపన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంను మల్లంపేటలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. సమాజంలో ఇతరులకు సేవ చేయడం అనేది కేవలం స్వచ్ఛంద సంస్థల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యతని, తమవంతుగా ఇతరులకు సహాయం చేయాలని సూచించారు.

ఎన్ఎస్ఎస్ వాలంటరీగా చాలా విషయాలు తెలుసుకోవడానికి ఈ క్యాంపు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. 13 క్యాంపులలో ఎన్ఎస్ఎస్ వాలంటరీగా నేను కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ నర్సింలు, ప్రోగ్రాం ఆఫీసర్ జూలకంటి శ్రీనివాస్, అధ్యాపకులు ప్రవీణ్, సంతోష్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.