calender_icon.png 12 February, 2026 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

19న పురస్కారాల ప్రదానోత్సవ సభ

12-02-2026 02:56:23 AM

ముషీరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ’భూపతి చంద్ర’ స్మారక కథానికల పోటీ-26 పురస్కారాల ప్రదానోత్సవ సభ ఈనెల19 వ తేది గురువారం సాయంత్రం 5 గంటలకు ఆబిడ్స్ బొగ్గులకుంటలోని తెలంగాణ తెలంగాణ సారస్వత పరిషత్తు డాక్టర్ దేవులపల్లి రామానుజ రావు కళా మందిరంలో నిర్వహిస్తున్నట్లు భూపతి చంద్ర మెమొరీయల్ ట్రస్ట్ అధ్యక్షులు ఎమ్.ఎల్. కాంతారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆయన మాట్లాడుతూ ప్రథమ బహుమతి సుంకోజి దేవేంద్రాచారి(అంతర్ధానం), ద్వితీయ బహుమతి పొత్తూరి సీతారామరాజు(పులి నెత్తుటి ముగ్గు), తృతీయ బహుమతి పుప్పాల కృష్ణమూర్తి(కన్నీట వసంతం), ప్రోత్సాహక బహుమతు లు డాక్టర్ ఎం. సుగుణ రావు (ఒక కొడుకు తీర్పు), చొక్కర తాతారావు(ఇచ్చోటనే కద), మొయిద శ్రీనివాసరావు (అంబటి తట్ట), ఉయ్యూరు అనసూయ(రెండో కోణం), మధుసూదన రావు(కర్టెన్), కథానికలకు అందించనున్నట్లు తెలిపారు.