వ్యవసాయంపై రైతులకు అవగాహన
మునిపల్లి,(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రమైన మునిపల్లి రైతు వేదికతోపాటు ఆయా రైతు వేదికల్లో సోమవారం “రైతు వారోత్సవం” కార్యక్రమాన్ని ఏవో అనితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఏడీఏ సత్యనారాయణ పాల్గొని రైతులకు నేల ఆరోగ్యం కాపాడుకోవడం, రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం, పచ్చి ఎరువుల సాగు చేయడం గురించి సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయంపై తప్పని సరిగా రైతులు వ్వవసాయ శాఖ అధికారుల సూచన మేరకు పంటలు వేసుకోవాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలు వేసి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాంరెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, ఏఈఓ తదితరులు పాల్గొన్నారు.






