24-02-2026 12:32:18 AM
మలక్పేట్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): చంచల్గూడ జైలులోని సికా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘ఆయుర్వేద గ్రామం’ను జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. ఆరేండ్ల విరామం అనంత రం ఈ కేంద్రాన్ని సోమవారం డిజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయుర్వేద గ్రామం పునరుద్ధరించడం శాఖకు కీలకమైన సంక్షేమ, సవరణాత్మక ముందడుగుగా నిలిచిందన్నారు.
అనుభవజ్ఞులైన ఆయు ర్వేద వైద్యులు, అర్హత కలిగిన థెరపిస్టులు, శిక్షణ పొందిన సిబ్బందితో పూర్తిస్థాయిలో సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. ఐజీ జైళ్లు ఎన్. మురళీబా బు, హైదరాబా ద్ రేంజ్ డీఐజీ డా. డి. శ్రీనివాస్, వరంగల్ రేంజ్ డీఐజీ ఎం. సంపత్, సీపీ హైదరాబాద్ సూపరింటెండెంట్ ఎన్ శివకుమార్గౌడ్ పాల్గొన్నారు.