29-05-2025 11:16:14 PM
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్..
చంపాపేట్ లో ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభం..
ఎల్బీనగర్ : చంపాపేటలోని సామ నరసింహరెడ్డి గార్డెన్ ఎదురుగా ఏర్పాటు చేసిన నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవం గురువారం నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవానికి ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఆయుర్వేదం అద్భుతమైన వైద్యమన్నారు. ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారతదేశం అన్నారు. ఈ నాటికి హిమాలయాల్లో అనేక ఔషధ మొక్కలు మానవ ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు బెంబేలెత్తి భయపడుతుంటే ధైర్యంగా ఉన్న దేశం భారతదేశం అన్నారు.
మన ఇంట్లో ఉన్న పోపుల పెట్టే ఆయుర్వేద వైద్యాన్ని అందించి మన వ్యాధి నిరోధకతను కాపాడుతుందన్నారు. నాగేశ్వర ఆయుర్వేద హాస్పిటల్ ప్రాక్టికల్ గా ఉంటూ, రోగులకు మంచి సేవలు అందించాలని అభినందనలు తెలిపారు. నిర్వాహకుడు ఆకుల నాగేశ్వరుడు మాట్లాడుతూ.. తమ వద్ద క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లకు ఆయుర్వేదంలో ప్రత్యేక చికిత్స అందిస్తామన్నారు. అదే విధంగా మిగతా వ్యాధులకు కూడా వైద్యం అందిస్తామన్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులోని తమ సొంత ఫ్యాక్టరీలో ఆయుర్వేద మందులు అత్యాధునిక నానో టెక్నాలజీతో తయారు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నరసింహరెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే కొత్త అశోక్ గౌడ్, కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ మాజీ చైర్మన్ ఈశ్వరమ్మ యాదవ్, కార్పొరేటర్లు ఆకుల శ్రీవాణి, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి, జంగం శ్వేత మధుకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వేములయ్య గౌడ్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సాగర్ గౌడ్, బీజేపీ ప్రకాశం జిల్లా మాజీ అధ్యక్షులు పులి కృష్ణారెడ్డి, గిద్దలూరు బీజేపీ కన్వీనర్ బ్రహ్మేశ్వర ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.