29-05-2025 11:19:29 PM
కొండపాక: అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను, జెసిబిని కుకునూరు పల్లి పోలీసులు పట్టుకొని స్టేషన్ కు తరలించారు. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్(SI Srinivas) తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుకునూరుపల్లి మండలంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు గురువారం ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు రామచంద్రపురం గ్రామ శివారులోని కాలువ వద్దకు వెళ్లి చూడగా అక్కడ మూడు టిప్పర్లు మట్టితో నింపి ఒక జెసిబితో మట్టి నింపుతుంది.
టిప్పర్ దగ్గరికి వెళ్లి విచారించగా టిప్పర్ డ్రైవర్లు దేశెట్టి అశోక్(31) బొప్పాయిపల్లి గ్రామం, తూరి కైలాస్ (32) జార్ఖండ్, బోదాస్ మల్లేష్ (55) సిద్దిపేట, జెసిబి డ్రైవర్ దుండగుల బాబు (32) బొప్పాయిపల్లి, వీరు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న మూడు టిప్పర్లను, ఒక జెసిబిని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించామని, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్ లను ఎస్సై అభినందించారు.