calender_icon.png 30 June, 2025 | 10:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి..

30-06-2025 04:45:36 PM

ఎంఈఓ శైలజ..

లక్షేట్టిపేట (విజయక్రాంతి): బడీడు పిల్లలని బడిలో చేర్పించాలని ఎంఈఓ శైలజ(MEO Shailaja) అన్నారు. సోమవారం మండలంలోని కొత్త కొమ్ముగూడెం గ్రామంలో పాఠశాల గత సంవత్సర కాలంగా మూతబడి విద్యార్థులు ప్రైవేటు బడులు పోయేవారు అని గ్రామస్థుల సహకారంతో మండల విద్యాధికారి శైలజ, నిరంతరం గ్రామస్థులను చైతన్యపర్చి బడి మానేసిన, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని అన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శైలజ మాట్లాడుతూ... ప్రతి రోజు పిల్లలని బడికి పంపాలని, బడిలో యూనిఫామ్స్, పుస్తకాలు, ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందిస్తారని అలాగే ప్రతి విద్యార్థినీ, విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ సిహెచ్ తిరుపతి కాంప్లెక్స్ సిఆర్పి విద్య, ఉపాధ్యాయురాలు సంధ్యరాణి, పంచాయితి సెక్రటరీ సురేందర్, గ్రామస్థులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.