calender_icon.png 1 July, 2025 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

30-06-2025 04:41:06 PM

ఏరియా జిఎం దేవేందర్..

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలోని సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏరియా జిఎం జి దేవేందర్(Area GM G Devender) స్పష్టం చేశారు. సోమవారం ఏరియాలోని జిఎం కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘంతో 7వ స్ట్రక్చర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకువచ్చారు. కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డిస్పెన్సరీలలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని, గనులలో కార్మికులకు రక్షణ పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే నాణ్యమైన పనిముట్లను, అందచేయాలని, కార్మికుల సౌకర్యార్థం నిర్మించిన గృహాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టి నాణ్యమైన విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గనుల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.

అనంతరం జిఎం జి దేవేందర్ మాట్లాడుతూ... గుర్తింపు సంఘం నాయకులు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించి కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్మిక సంఘం నాయకులు కార్మికుల సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారానికి తగిన కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఎస్ఓటు జిఎం విజయప్రసాద్, ఐఈడి కిరణ్ కుమార్, డివైజిఎం సివిల్ రాములు, ఏజీఎం వెంకట రమణ, వర్క్ షాప్ డివైజియం దూపూసింగ్, డాక్టర్ నాగేశ్వర రావు, ఎఐటియుసి సెంట్రల్ సెక్రటరీ ఎండి అక్బర్ అలీ, బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ భీమనాదుని సుదర్శనం, సహాయ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం, ఏరియా నాయకులు సివి రమణలు పాల్గొన్నారు.