07-06-2025 02:17:36 AM
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
చేగుంట, జూన్ 6: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం చేగుంట మండల కేంద్రంలో సుభాష్ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన గ్రామసభలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధా కిషన్, ఎంఈఓ, సంబంధిత ప్రధానోపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాలల ద్వారా మాత్రమే సాధ్యమని విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా సర్కారు బడుల్లో సౌకర్యాలను మెరుగుపరిచి ఊరు వాడ తిరిగి బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యత, ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలు గురించి, పాఠశాలల్లో కల్పించే మౌలిక వసతులు, విద్యార్థినీ విద్యార్థులకు యూనిఫారమ్స్, టెస్ట్ అండ్ నోట్ బుక్స్, అందించుట కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటూ సదుపాయాలు మెరుగుపరుస్తూ విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందిస్తున్నామని బడి ఈడు పిల్లలందరూ బడిలో చేరాలని గ్రామ ప్రజలకు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.
గ్రామ సభల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు వింటం వినడం జరిగిందని మరియు వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించడానికి ముందుకు రావాలని మరియు దీని ద్వారా విద్య యొక్క ప్రాముఖ్యతను పెంచడం లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు..కలెక్టర్ బడిబాట కార్యక్రమాన్నివిజయవంతం నిర్వహించడానికి సహకరించాలని మరియు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సమర్ధంగా ఉపయోగించుకోవాలని కోరారు. అనంతరం మండల కేంద్రంలో బడిబాట ర్యాలీలో కలెక్టర్ పాల్గొని బడిబాట గ్రామసభ విజయవంతానికి చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు ప్రజా ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలోపాల్గొన్నారు.