11-09-2024 04:19:04 PM
హైదరాబాద్: ఢిల్లీ మధ్యం కేసులో మరో నిందితుడికి బుధవారం బెయిల్ లభించింది. ఈడీ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజురు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ ఆరోపణలపై హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త అయిన అరుణ్ రామచంద్రన్ పిళ్లైను ఈడీ అరెస్టు చేసింది. పిళ్లై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడని, మద్యం కుంభకోణంలో కవిత ప్రయోజనాల కోసం పనిచేశాడని, ఇండోస్పిరిట్ లిక్కర్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి లంచాలు స్వీకరించి, ఇతర నిందితులకు అందించాడన్న ప్రధాన అభియోగం అతనిపై ఉంది. గతేడాది మార్చిలో ఈడీ పిళ్లైని అరెస్టు చేయగా, కొన్ని రోజులకే కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.