07-06-2025 05:21:15 PM
అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ..
అచ్చంపేట: త్యాగానికి, సహనానికి, భక్తి విశ్వాసాలకు బక్రీద్ పండుగ(Eid al-Adha) ప్రతీకగా నిలుస్తుందని అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ(MLA Dr. Vamshi Krishna) అన్నారు. శనివారం బక్రీద్ పర్వదినం సందర్భంగా పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ గంగాపురం రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, డీఎస్పీ వెంకటేష్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు ముస్లిం సోదరులకు శుభకాంక్షలు తెలిపారు. శాంతి, కరుణ, సహనం, సామరస్యం, ఐకమత్యం, సోదరభావం స్ఫూర్తితో ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం బక్రీద్ పండుగ ప్రధాన ఉద్దేశమన్నారు. వారితో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కౌన్సిలర్ గౌరీ శంకర్, సునీత శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ రామనాథం, డిసిసి కార్యదర్శి కాశన్న యాదవ్, పట్టణ అధ్యక్షులు రఘురాం, ఎస్ సెల్ అధ్యక్షులు రాజగోపాల్, నాయకులు మహబూబ్ అలీ, ఖాజా, రఫీ, ఖాదర్, షాపూర్, హుస్సేన్, బషీర్, సుల్తాన్, నవీద్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ, అమ్రాబాద్ మండలం కేంద్రంలోని ఓ ప్రైసటు ఫంక్షన్ హాల్ లో అర్హులైన వారికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు.