calender_icon.png 8 June, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ

07-06-2025 05:24:03 PM

చేగుంటలో ఘనంగా బక్రీద్ వేడుకలు..

ఈద్గాలో సామూహిక ప్రార్ధనలు..

చేగుంట (విజయక్రాంతి): త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ(Eid al-Adha) అని చేగుంట జామ మసీదు ఇమామ్ మౌలానా అన్వార్ అన్నారు. శనివారం బక్రీద్ పండుగ సందర్భంగా పట్టణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మాట్లాడారు. బక్రీద్ పండుగ ప్రవక్త ఇబ్రహీం, భక్తి భావాన్ని, విశ్వాసాన్ని, త్యాగ భవనాలను, సమాజానికి ప్రబోధిస్తుందన్నారు. ఈ పండుగ రోజున అల్లాకు ఇష్టమైన ఆచారం ఖుర్బానీ, ఇవ్వడం అని అన్నారు. పండుగలోని పరమార్థం జంతువులను బలివడమే కాదని, హృదయంలోని స్వార్థం, అహంకారం, భౌతిక ఆసక్తులను త్యాగం, చేసి అల్లాకు దగ్గరవడమే అన్నారు.

స్తోమత ఉన్న ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంత త్యాగం చేసి పేదల ఆకలి తీర్చడం మానవత్వాన్ని వెలుగులోకి తేవడమే అన్నారు. సామూహిక ప్రార్ధన అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని సోదర భావాలు వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బక్రీద్ సందర్భంగా పలు రాజకీయ పక్షాల నాయకులు ఈదుగా వద్ద ముస్లిం సోదరులకు స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలిపారు. సామూహిక ప్రార్థనల ఏర్పాట్లను, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేగుంట ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి ఆదేశానుసారం ఎస్ ఐ 2, పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సదర్ షకీల్, రహీమోద్దీన్, జాలిల్,తదితరులు పాల్గొన్నారు.