07-06-2025 05:18:26 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో విద్యాశాఖ ద్వారా అమలు అవుతున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు(District Education Officer Rama Rao) పేర్కొన్నారు. శనివారం సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి దిల్వార్పూర్ మండలంలోని కాల్వ కాలువ తండా గ్రామాల్లో నిర్వహించిన బడిబాడ కార్యక్రమంలో పాల్గొన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలో విద్య యొక్క ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన చదువు ఉచితంగా నోటు పుస్తకాలు పుస్తకాలు స్కూల్ డ్రెస్సులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రవీణ్ కుమార్ రాజేశ్వర్ లింబాద్రి సాయన్న తదితరులు పాల్గొన్నారు