07-06-2025 05:34:36 PM
మునిపల్లి: ఆస్ట్రేలియా సిడ్నీలో వెస్టర్న్ యూనివర్సిటీ(Western University)లో తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఖమ్మం పల్లి గ్రామానికి చెందిన పైతర సాయిక్రిష్ణ అనే యువకుడు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి సర్టిఫికెట్ ను యూనివర్సిటీ ఛాన్స్లర్ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా సాయిక్రిష్ణ తల్లిదండ్రులు మాజీ జెడ్పిటిసి సభ్యురాలు పైతర మీనాక్షి సాయికుమార్ ఆస్ట్రేలియాకు వెళ్లి అభినందించారు. సాయిక్రిష్ణను సన్మానించిన వారిలో కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, పీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పైతర సాయికుమార్, మునిపల్లి మాజీ జెడ్పిటిసి పైతర మీనాక్షి సాయికుమార్, మనీష్ రెడ్డి, మనోజ్ తదితరులు ఉన్నారు.