26-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాం తి): ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చట్టపరంగా అడ్డు కుంటామని రాష్ర్ట నీటిపారుదల శాఖ మం త్రి ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడడమే తమ ప్రధాన కర్తవ్యమ ని ఆయన తేల్చిచెప్పారు.
ఈ ప్రాజెక్టును నిర్మిస్తే రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బ తింటాయో, ఏమేరకు నష్టం కలుగుతుందోనన్న అంశంలో బలమైన వాదనలు వినిపించి, ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలువరిస్తామని భరోసా వ్యక్తంచేశారు. బుధవారం జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మం త్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
గోదావరి తెలంగాణకు ఏర్పడనున్న ముప్పును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలసి 19న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పా టిల్కు వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చామన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్రీ- ఫిజిబిలిటీ నివేదికను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించవద్దని తేల్చిచె ప్పామన్నారు.
ఈ ప్రాజెక్టును నిర్మిస్తే రాష్ర్ట నీటి కేటాయింపులపై ప్రభావం చూపుతుందని, దానిని దృష్టిలో పెట్టుకుని నివేదికను తిరస్కరించాలని కోరామన్నారు. అందుకు స్పందించిన కేంద్ర మంత్రి పాటిల్ ఏపీ ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఆమోదించలేదని.. త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని ఆయన వివరించారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పుట్టుకొచ్చిన గోదావరి ప్రాజెక్టు నిర్మిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు జరిగే నష్టాన్ని ప్రజా ప్రతినిధులకు వివరించేందుకు ఈ నెల 30న ప్రజాభవన్లో మధ్యాహ్నం 3 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఏర్పాటు చేశామన్నారు.
నీటి పారుదల శాఖలోకి ఇద్దరు సైనికాధికారులు...
టన్నెల్ నిర్మాణాలలో అపారమైన అనుభవం ఉన్న సైనికాధికారులను నీటిపారుదల శాఖలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇటీవల రోహ్తంగ్, జోజిలా పాస్ టన్నెల్ నిర్మాణంలో పనిచేసిన ఇద్దరు అధికారులను వినియోగించుకునేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. సైన్యంలో ఇంజినీర్ ఇన్-చీఫ్ గా పనిచేసిన జనరల్ హార్బల్ సింగ్ను రాష్ర్ట నీటిపారుదల శాఖకు సలహాదారుడిగా ఉండమని అహ్వానించామన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన టన్నెల్ టెక్నాలజీ నిపుణులు కర్నల్ పరిక్షిత్ మోహ్రా ఈ జూలైలో రాష్ర్ట నీటిపారుదల శాఖలో చేరనున్నారని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిలపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికల ప్రకారం పునరుద్ధరణ పనులకు అదే సంస్థ డిజైన్ కన్సల్టెంట్గా వ్యవహరిస్తుందన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను సత్వరమే అమలు లోకి తీసుకు రావాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ కోసం..
ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణ పనుల కోసమై అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలతో చర్చించి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్ధరణ పనులు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఖర్చుకు వెనకాడకుండా ముందుకుపోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ప్రధాన ప్రాజెక్టులలో పూడికతీత పనులపై ఆయన స్పందిస్తూ అనేక జలాశయాలు పూడికతో పూడి పోయి ఉన్నందున 20 నుండి 25 శాతం మేర నీటిసామర్ధ్యం తగ్గిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీచేసిన జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. నాగార్జున సాగర్, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల పూడికతీత పనులపై ఆయన అడిగి తెలుసుకున్నారు.
ప్రత్యేకంగా నాగార్జునసాగర్ పూడికతీత పనులను సత్వరం ప్రారంభించాలన్నారు. ఈ విషయమై ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందించాలని అధికారులను సూచించారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల పురోగతితో పాటు సీతారామ ప్రాజెక్టుకు ప్రస్తుతం కేటాయించిన నిధుల పరిమితులకు లోబడి అదనపు ప్యాకేజీలను రూపొందించే అంశలపై అధికారులు దృష్టి సారించాలన్నారు.
డిండి ప్రాజెక్ట్ భూసేకరణ విషయమై సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. నీటిపారుదల శాఖలో పెండింగులో ఉన్న పదోన్న తుల ప్రక్రియను వేగవంతం చేయాలని, బదిలీల తంతును వెంటనే పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. సమీక్ష నీటిపారుదల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ మహమ్మద్ అంజాద్ హుస్సేన్, డిప్యూటీ ఈఎంసీ శ్రీనివాస్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.