25-06-2025 11:50:26 PM
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు..
హైదరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి ఎంతో కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేస్ వెంటనే కేంద్రం నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) కోరారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో ఫేస్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి.. ప్రధాని మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి విజ్ఞాపనలు ఇచ్చినా స్పందించలేదన్నారు. మెట్రో ఫేస్ సంబంధించిన డీపీఆర్ కూడా ఇప్పటికే కేంద్రానికి అందించామని ఆయన వెల్లడించారు. వెంటనే కేంద్ర కేబినెట్ హైదరాబాద్ రెండో దశ మెట్రోపై నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటారని తాము భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. కేంద్ర జీడీపీలో ఎంతో కీలకంగా తెలంగాణ పాత్ర ఉందన్నారు.