calender_icon.png 23 June, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బేరం కుదర్లే!

23-06-2025 12:30:19 AM

- కల్వకుర్తి కేంద్రంగా అక్రమ రేషన్ బియ్యం దందా..!

- సన్నబియ్యమే సరఫరా  చేస్తున్నా ఆగని అక్రమ వ్యాపారం

- రీసైక్లింగ్ ద్వారా కోట్లు కొల్లగొడుతున్న రైస్ మిల్లర్లు

- స్థానికులు సమాచారం ఇచ్చినా పెడచెన అధికారులు

- ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు జరిపి శాంపిళ్ళ సేకరణ

- కేంద్ర రాష్ట్రస్థాయిలో వేర్వేరు రిపోర్టులు

- తెర వెనుక అధికారులతో భేరసారాలు

- బేరం కుదరక కేసుల నమోదు 

 నాగర్ కర్నూల్ జూన్ 22 (విజయక్రాంతి) / కల్వకుర్తి నిరుపేదల ఆకలి తీర్చా లన్న లక్ష్యంతో  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు రేషన్ దుకాణాల ద్వారా రేషన్ సన్న బియ్యం ఉచితంగా  సరఫరా చేస్తోంది. కానీ కొంతమంది రైస్ మిల్లర్లు, అక్రమార్కులు సామాన్యులను బురిడీ కొట్టించి రేషన్ బియ్యం సేకరించి వాటిని రైస్ మిల్లర్ల ద్వారా తిరిగి రీసైక్లింగ్ చేస్తూ ప్రభుత్వాన్ని మోసగిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు.

ఈ అక్రమ దందా వ్యాపారం కల్వకుర్తి అడ్డాగా చెలరేగిపోతోందని తీవ్ర విమర్శలు ఉన్నా యి. కల్వకుర్తి ప్రాంతాల్లోని రైస్ మిల్లర్లు ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని సేకరించి వాటిని బియ్యంగా ఆడించి ఎఫ్ సిఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)కి బియ్యం పంపాల్సి ఉంటుంది.

కానీ ప్రభుత్వం నుండి సేకరించిన వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు రాత్రిళ్ళు అక్రమ రవాణా చేసి వాటి స్థానంలో ప్రజల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని రీసైకిలింగ్ చేస్తూ తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్తూ కోట్లకు పెడగలెత్తుతున్నట్లు ప్రచారం జోరం అందు కుంది. ఈ నేపథ్యంలోనే స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గత కొద్ది రోజుల క్రితం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కల్వకుర్తి ప్రాం తం ఎల్లికల్ రోడ్డు సమీపంలో ఉన్న ఓ  రైస్ మిల్లల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు.

కొన్ని రైస్ మిల్లల్లో అనుమానిత రైస్ సేకరించి ల్యాబ్ కు పంపారు. అక్కడ కూడా అనుమానం రావడంతో కేంద్రానికి పంపారు. అక్కడ వచ్చిన రిపోర్టు ఆధారంగా తనిఖీ చేసిన బియ్యాన్ని సీజ్ చేయాలని జిల్లా స్థా యి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లా పౌరస రఫరాల శాఖ అధికారి నర్సింగరావు , సివిల్ సప్లై మేనేజర్ రవికుమార్, రెవెన్యూ అధికారులు బియ్యన్ని సీజ్ చేశారు.

కానీ స్థానిక పోలీస్ లేదా ఇతర మీడియా ఎవరికి తెలియకుండా గోప్యత పాటించడంతో తెరవెను క రాజీ ప్రయత్నాలు భారీగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘ చర్చల అనంతరం 702 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో వేరువేరు రిపోర్టులు రావడంతో  రాష్ట్రస్థాయిలో పరీక్షలు జరిపే ల్యాబ్ వద్ద కూడా మాఫియా మనుషులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మూడేళ్ళ క్రితం కల్వకుర్తి పట్టణంలోని శ్రీనిధి రైస్ మిల్లులో 122.1టన్నుల బియ్యా న్ని పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. సదరు మిల్లుపై 6ఎ కేసు నమోదు చేయడమే కాకుండా మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి మిల్లును బ్లాక్ లిస్ట్ లొ పెట్టినట్లు జిల్లా అధికారి తెలిపారు. 

కేసులు పెట్టారు .... కానీ కాగితాలపై మాత్రమే!

100 టన్నులకు పైగా రేషన్ బియ్యం పట్టుపడడం అప్పట్లో సంచలనం కల్గించింది. కానీ కొన్ని నెలల తర్వాత అదే మిల్లు లో అర్ధరాత్రిళ్లు జరిగే అక్రమ వ్యాపారాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. కేసు అవ్వకముందు చుట్టుపక్కల గ్రామాల నుండి రేష న్ బియ్యం సేకరించే వారు... కాని కేసు అయ్యాక పక్క రాష్ట్రాల నుండి కూడా బి య్యం సేకరించే పని పెట్టుకుని మూడో కంటికి తెలియ కుండా అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో  ఈ నెల మొదట వారంలో కర్నూల్ జిల్లా నంద్యాల నుండి డీసీఎం వాహనంలో బియ్యం రావడంతో తేటతెల్లమైంది. 

కేసులు, బ్లాక్ లిస్ట్ లను ముందే ఊహించిన అక్రమార్కులు. 

రేషన్ బియ్యం అక్రమ వ్యాపారంలో కేసులు అవుతాయని ముందే ఊహించిన అక్రమ వ్యాపారస్తులు తెలివిగా బినామీ పేర్ల మీద మరో మిల్లుకు అనుమతులు తీసుకుని అక్రమ వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. అక్రమ వ్యాపారంలో ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా జిల్లా స్థాయి అధికారుల నుండి మండల స్థాయిలో పనిచేసే సంబంధిత అన్ని శాఖల అధికారులను స్థాయిని బట్టి ముడుపులు ముట్టజెబుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. 

రేషన్ డీలర్లే మొదటి దొంగలు..!

ప్రభుత్వం రేషన్ డీలర్ల ద్వారా సరఫరా బియ్యాన్ని లబ్ధిదారులు సేకరిస్తున్న క్రమ ంలో వేలిముద్రలు తీసుకొని నేరుగా కిలోకి రూ.25 చొప్పున డబ్బులు తమ అకౌంట్లోకి ఫోన్పే ద్వారా కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమ రేషన్ బియ్యం సరఫరాకు మొదటి బీజం అక్కడే పడుతోందని ప్రచారం జరుగుతుంది.

దీంతోపాటు ఆయా పట్టణ కేంద్రాల్లో గింజలు సేకరించే వ్యక్తులతో పాటు కిరాణా దుకాణాదార్లు కూడా రేషన్ బియ్యం సేకరిస్తూ అక్రమ వ్యా పారులకు అంటగడుతున్నారు. వారి నుండి నేరుగా రైస్ మిల్లర్లకు పంపిణీ చేస్తూ సొ మ్ము చేసుకుంటున్నారు. ఈతంగమంతా జిల్లా ఆయా శాఖల అధికారులతో పాటు ఉన్నతాధికారులకు కూడా ముడుపులు అందడంతోనే కిమ్మనకుండా ఉంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం పథకం తూ ట్లు పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఈ వ్యవహారంపై జిల్లా పౌరసర ఫరాల శాఖ అధికారి నరసింహారావును వివరణ కోరేందుకు ఫోన్ లైన్ లో సంప్రదిం చగా అందుబాటులోకిరాలేదు.