29-06-2025 12:16:00 AM
న్యాయమూర్తి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి
ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని ప్రభుత్వ బాలబాలికల ఉన్నత పాఠశాల నందు ఇల్లందు మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో శనివారం న్యాయ చైతన్య సదస్సు నిర్వహిచారు. ఈ కార్యక్రమానికి ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి చంద్రిక రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం వాటి వలన కలిగే దుష్ఫలితాలు, అక్రమ రవాణా అరికట్టడంపై చిన్న వయస్సు నుంచి అవగాహన కలిగి ఉండాలని మత్తు పదార్థాలు వినియోగం వల్ల ఏర్పడుతున్న దుష్ఫలితాల గురించి, అక్రమ రవాణా విద్యార్థి, విద్యార్థులు తెలిసిన వ్యక్తుల ద్వారా గాని, తెలియని వ్యక్తుల ద్వారా గాని వారికి తెలియకుండానే అక్రమ రవాణాకు బాధ్యులు అయ్యే అవకాశం ఉందన్నారు. అందుకే మీకు తెలియకుండా అపరిచిత వ్యక్తులు ఇచ్చే వస్తువులని అందులో ఏమి వస్తువులు ఉన్నాయని తెలుసుకొని ఇవ్వడం వల్ల బారిన పడకుండా చూసుకునే బాధ్యత మీదే అని తెలిపారు.