29-06-2025 12:13:32 AM
మునగాల: మునగాల మండల కేంద్రంలో టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ టిడిపి మండల అధ్యక్షుడు నాదెళ్ల గోపాలరావు పాల్గొని మాట్లాడుతూ... పత్రికా ఆఫీసు ల పైన మీడియా సంస్థల కార్యాలయాల పైన దాడి చేసి మీడియా గొంతు నొక్కి వారిని భయబ్రాంతులకు గురిచేయాలని భారత రాష్ట్ర సమితి నేతల ప్రయత్నం అమానుషం దారుణం. వాళ్ళు తాము ఇంకా అధికారం లో ఉన్నాము అనే భ్రమలో ఉన్నారా? మీరు చేసిన అవినీతి అక్రమాల వల్ల మీ అధికారం పోయి చాలాకాలం అయింది.
తస్మాత్ జాగ్రత్త. మీ ఆటలు ఇక సాగవు. మీ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసిన మోసం అందరికీ అర్థం అయింది. మిమ్మల్ని భూస్థాపితం చేసే వరకు తెలంగాణ ప్రజలు నిద్రపోరు. మహా న్యూస్ కార్యాలయం పై దాడి ప్రజాస్వామ్యం పై దాడి అని ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం 6ఈ దాడి కి బాధ్యులైన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ దాడిని ప్రజాస్వామ్య వాదులు అందరూ ఖండించాలని ఆయన కోరారు. ఈ దాడి వెనుక ఉన్న వారిని కూడా కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కోరారు.