1 March, 2026 | 9:58 PM

లంచం తీసుకున్న బీట్ ఆఫీసర్!

01-03-2026 12:00 AM
  1. అడవిలో పశువులను మేపడానికి తీసుకున్నాడన్న రైతులు
  2. చర్యలు తీసుకోవాలని డిమాండ్
  3. రైతుల కాళ్లు మొక్కిన బీట్ ఆఫీసర్!

కామారెడ్డి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): అడవిలో పశువులను మేపడానికి అనుమతి కోసం బీట్ ఆఫీసర్ డబ్బులు తీసుకున్నాడని, డబ్బులు ఇస్తేనే పశువులను మేపేందుకు అవకాశం కల్పిస్తున్నాడని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు.

బీట్ ఆఫీసర్ రైతుల నుంచి ఓ రూ.5 వేలు, రూ. 10 వేలు వేర్వేరుగా రెండుసార్లు ఫోన్ పే చే యించుకుని, పశువులను మేపుకునేందుకు అనుమతి ఇచ్చాడని రైతులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీంతో దిగివచ్చిన బీట్ ఆఫీసర్ రైతుల కాళ్లపై పడి, ఫిర్యాదు చేయోద్దని ప్రాధేయపడినట్టు తెలిసింది.