8 April, 2026 | 5:38 AM

మహా కుంభ్‌కు వెళ్తుండగా రోడ్డుప్రమాదం

22-02-2025 04:28 PM

ధన్‌బాద్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్‌(Prayag Kumbh Mela)కు వెళుతుండగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన నలుగురు వ్యక్తులు శనివారం తెల్లవారుజామున జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టడంతో మరణించారని పోలీసులు తెలిపారు. రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని జాతీయ రహదారి 2పై తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని వారు తెలిపారు. వాహనంలో ఎనిమిది మంది ఉన్నారని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అలీషా కుమారి తెలిపారు. "నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు" అని ఆమె తెలిపారు. గాయపడిన వారిని షాహిద్ నిర్మల్ మహతో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SNMMCH)లో చేర్చినట్లు అలీషా కుమారి తెలిపారు. మృతులను షేక్ రాజబాలి, డ్రైవర్ పియాలి సాహా, తెములి సాహా,పనోబా సాహాగా గుర్తించారు, వీరందరూ పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని కమర్పుకుర్ నివాసితులని పోలీసుల తెలిపారు.