01-06-2025 12:00:00 AM
ఈ మధ్యకాలంలో చాలామంది పెళ్లిళ్లే చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. పాతికేళ్లు దాటినా ఏమాత్రం పెళ్లి ఊసు ఎత్తట్లేదు. కెరీయర్పై దృష్టి పెడుతూ.. 30 దాటాకే చాలామంది వివాహం చేసుకుంటున్నారు. ఇక పిల్లల గురించి ప్లాన్ చేసుకోవడానికి మరికొంత సమయం అంటూ ఆగుతున్నారు.
ఈ క్రమంలో తల్లి కాబోయే వయసు మునుపటికన్నా పెరుగుతోంది. చదువు, కెరీర్లకు అధిక ప్రాధా న్యం ఇవ్వడం ఒక కారణమైతే, మరో కారణం ఆధునిక వైద్యం.. వయసు మీరిన మహిళలకు కూడా సంతానావకాశాలను కలుగజేస్తోంది. అయితే కొంత వయసు దాటాక స్త్రీలు బిడ్డలను కనడం ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారితీ స్తుంది.
35 సంవత్సరాలు దాటి న మహిళలు గర్భం దాల్చినప్పు డు.. తల్లి, బిడ్డా ఇద్దరూ అనారోగ్యాల బారినపడే అవకాశ ముంది. గర్భం దాల్చబోయే ముం దు.. గర్భంతో ఉన్నప్పుడు కాన్పు సమయం లో ఇలా ప్రతి దశలో నూ సమస్యలు తలెత్తుతాయి.
నిపుణుల అభిప్రా యం ప్రకారం 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చ డం అనే ది కాస్త కష్టంతో కూడుకున్నది. ఈ సమయంలో స్త్రీలు సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటారు. ఇ క శిశువుల్లో క్రోమోజోమ్ అ సాధారణతలు పెరిగే అవకాశం ఉంటుంది. గర్భిణుల్లో మధుమేహం ఉంటే.. పుట్టే బిడ్డలో గుండె సమస్యలు, అవయవ లోపాలు తలెత్తుతాయి. అధిక రక్తపోటు వల్ల గర్భాశయంలోని మాయ విచ్చుకుపోయి..
గర్భంలోనే బిడ్డ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. పిల్ల లు నెలల నిండకుండా పుట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలంటే ప్రినేటర్ స్కీ నింగ్, అమ్నియోసెంటెసిస్, కోరియోనిక్ విల్లస్ శాం ప్లింగ్ వంటి రోగనిర్ధారణ పరీక్షలు చేయ్యాలి. అలాగే బీపీ పెరిగితే ప్రీఎక్లంప్సియా వంటి సమస్యలు వస్తాయి.
20 సంవత్సరాల వయస్సులో గర్భం దాల్చడం ఉత్తమం. మరికొందరు మొదటి ప్రెగ్నెన్సీ తర్వాత ఎక్కువ విరామం తీసుకుని రెండో ప్రెగ్రెన్సీకి సిద్ధమవుతారు. ఇలా చేయడం కూడా సరికాదు. రెండు గర్భాల మధ్య 18 నెలల విరామం ఉండాలి. మొదటి గర్భం నుంచి కోలుకున్న తర్వాత.. మరొక గర్భం కోసం సిద్ధం అవ్వాలి.
ప్రీకన్సెప్షనల్ కౌన్సెలింగ్
భవిష్యత్తు గర్భధారణ కోసం ప్రీకన్సెప్షనల్ కౌన్సెలింగ్ ఆస్పత్రుల్లో అందుబాటు లో ఉన్నాయి. ఈ కౌన్సెలింగ్లో భాగంగా కుటుంబ చరిత్ర, ఆరోగ్య సమస్యలు, జీవనశైలి, రిస్క్ ఫ్యాక్టర్లు మొదలైన అంశాలను వైద్యులు చర్చించి, గర్భధారణ అవకాశాలను బేరీజు వేసి, అందుకు సరైన వయసును సూచిస్తారు. గర్భధారణకు సంబంధించిన అనుమానాలను ఇలాంటి ప్రీకన్సెప్షనల్ కౌన్సెలింగ్తో నివృత్తి చేసుకోవచ్చు.
ఈ జాగ్రత్తలు అవసరం
రోజులు గడుస్తున్న కొద్దీగా విడుదలయ్యే అండాల నాణ్యత, పిండంలో లోపాలు వస్తాయి. అందుకే జీవితంలో ఇంకా స్థిరపడని వారు తగిన సమయంలో ఆరోగ్యంగా ఉన్న అండాలను సేకరించి పెట్టుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. దాన్నే ఎగ్ ఫ్రీజింగ్ అంటారు. ఆరోగ్యంగా ఉన్న అండాలను భద్రపరిచి, మనం సిద్ధంగా ఉన్నప్పుడు బిడ్డను కనొచ్చు.
35 ఏళ్ల తర్వాత కూడా సురక్షితమైన గర్భధారణ కోసం సరైన బరువు ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి వంటివి పండంటి బిడ్డ పుట్టేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. గర్భధారణకు ముందునుంచే గైనకాలజిస్ట్ సూచనలు అనుసరిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. వైద్యులకు ఆరోగ్య వివరాలను, కుటుంబ ఆరోగ్య చరిత్ర గురించి కూడా చెప్పాలి.
ఈ టెస్టులు తప్పనిసరి
పిల్లల్ని కనడం ఆలస్యం అయినవారు కొన్ని టెస్టులు చేయించుకోవడం మంచిది. మెటర్నరల్ బ్లడ్ స్కీనింగ్ పరీక్షల వల్ల పుట్టబోయే చిన్నారిలోని లోపాలన్నీ నూరు శాతం తెలియకపోవచ్చు. కానీ రాబోయే ముప్పులు కొంత తెలిసే అవకాశాలు మాత్రం ఉంటాయి. న్యూకల్ ట్రాన్స్ లుయెన్సీ స్కాన్ టెస్ట్ అనే పరీక్షను గర్భధారణ తర్వాత 14వ వారాల లోపు చేయించాలి. గర్భధారణ తర్వాత 20 వారాలప్పుడు అనామలీ స్కాన్ వంటి పరీక్షల్ని చేయించుకోవాలి.