30-06-2025 12:49:02 AM
న్యూఢిల్లీ, జూన్ 29: తెలంగాణలోని భద్రాచలం ఆదివాసీ మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆదివారం నిర్వహించిన 123వ మన్కీబాత్ ఎపిసోడ్లో మోదీ మాట్లాడారు. భద్రాచలం ఆదివాసీ మహిళలు భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరిట బిస్కెట్లు తయారు చేస్తున్నారని.. వారు తయారు చేసిన బిస్కెట్లు లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని తెలిపారు.
కేవ లం బిస్కెట్లు మాత్రమే కాకుండా మూడు నెలల్లో 40 వేల శానిటరీ నాప్కిన్లను తయా రు చేసి విక్రయించారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో బౌద్ధ క్షేత్రాలకు విదేశాల్లో అత్యంత ప్రాధాన్యం ఉందన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న శుభాంశు శుక్లాకు మోదీ అభినందనలు తెలియజేశారు. దేశ జనాభా లో 64శాతం కన్నా ఎక్కువ మంది ఏదో ఒక సామాజిక రక్షణ పథకం ద్వారా లబ్ధి పొం దుతున్నట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలియజేసిందని పేర్కొన్నారు. అంతే కాకుండా శాశ్వత అంధత్వానికి దారితీసే ట్రకోమా వ్యాధి నుంచి భారత్ పూర్తిగా విముక్తి పొందినట్టు అంతర్జాతీయ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకటించినట్టు తెలిపారు.
ఎమర్జెన్సీ విధించిన వారు ఓడిపోయారు
దేశంలో ఎమర్జెన్సీ విధించినవారు ఓడిపోయారని మోదీ తెలిపారు. ఎమర్జెన్సీని విధించినవారు రాజ్యాంగాన్ని హత్య చేయడం మాత్రమే కాకుండా న్యాయ విభాగాన్ని బానిసగా మార్చుకునేందుకు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజలు శక్తివంతమైన వారు కావడంతో ఎమర్జెన్సీ తొలగిపోయిందని.. ఎమర్జెన్సీ విధించిన వారు ఓడిపోయారన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన వారిని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని మోదీ తెలిపారు.
బాబు జగ్జీవన్ రామ్, వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ వంటి నేతల ప్రసంగాలను ప్రధాని వినిపించారు. జోడోల్యాండ్ ఫుట్బాల్ ఆటగాళ్లకు కేంద్రంగా మారిందని అభినందించారు. ఫిట్నెస్, ఊబకాయం తగ్గించుకునేందుకు ఆహారంలో నూనె వినియోగాన్ని 10 తగ్గించుకోవాలని ప్రధాని సూచించారు. మేఘాలయ ఎరీసిల్క్కు జీఐ ట్యాగ్ లభించడంపై ఆనందం వ్యక్తం చేశారు. జూన్ 21న నిర్వహించిన యోగా డేలో లక్షల మంది పాల్గొన్నారని తెలిపారు.