30-06-2025 12:46:21 AM
భారత్పై నోరు పారేసుకున్న పాక్ ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ, జూన్ 29: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శనివారం కరాచీలోని పాకిస్థాన్ నేవల్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ భారత్పై విషం కక్కారు. ‘భారత్ రెండు సార్లు కారణం లేకుండా పాక్పై దాడి చేసింది. ఆ దేశానికి వ్యూహాత్మక ముందుచూపు కొరవడింది.
ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోంది. మరోసారి ఇటువంటి దాడులకు పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తాం. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో ఉంటే భారత్ మాత్రం ఉద్రిక్తతలను పెంచి పోషిస్తోంది. భారత్ రెచ్చగొట్టేలా వ్యవహరించినప్పటికీ పాక్ సంయ మనం పాటించింది.’ అని పేర్కొన్నారు.
బెదిరింపులకు దిగిన మునీర్
పాకిస్థాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ మరోసారి బెదిరింపులకు దిగారు. ‘భారత్ అక్రమంగా ఆక్రమించడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మా కశ్మీరి సోదరుల త్యాగాలు మేము గుర్తుంచుకుంటాం. ఐరాస తీర్మానాలు, కశ్మీరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాకిస్థాన్ పోరాడుతుంది.’ అని పేర్కొన్నారు.