28-05-2025 12:52:16 PM
తల్లి, బిడ్డ క్షేమం
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ పాటిల్ సతీమణి బుధవారం ప్రసవించి మగ బిడ్డ జన్మనిచ్చారు. చాలాకాలంగా ఆమె పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు చేయించుకుంటూ ప్రసవించారు. కలెక్టర్ సతీమణి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందటంతో ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచారు.