20-06-2025 12:00:00 AM
భద్రాచలం, జూన్ 19 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కి హైదరాబాద్ కు చెందిన భక్తులు రూ 4,98, 520 విలువ గల 52 .25 గ్రాములు బంగారు హారాన్ని గురువారం బహుకరించారు.
హైదరాబాద్కు చెందిన ఎం కృష్ణ చైతన్య, రాజ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తయారు చేయించిన బంగారు హారాన్ని గురువారం ఉదయం దేవాలయం వద్ద దేవస్థానం ఈవో ఎల్ రమాదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపర్డెంట్ కత్తి శీను తదితరులు పాల్గొన్నారు.