calender_icon.png 20 June, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 50 శాతం ఫీజు రాయితీ

20-06-2025 12:00:00 AM

సర్కులర్లు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ..

ఖమ్మం జూన్19 (విజయ క్రాంతి) : ఖమ్మం జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని టీయూడబ్ల్యూజే (టి.జె.ఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ, శెట్టి రజినీకాంత్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు లు విద్యాశాఖ అధికారులకు చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి సామినేని సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కే రవిబాబు స్పందించారు. 

2025- 2026 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేట్, ఎయిడెడ్ విద్య సంస్థలలో నర్సరీ నుంచి పదవ తరగతి వరకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యాసంస్థలలో విద్యను అభ్యసిస్తున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ డి ఈ ఓ సామినేని సత్యనారాయణ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి కే రవిబాబు సర్క్యులర్ ను జారీ చేశారు.

తక్షణమే అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు తమ ఆదేశాలను అమలు చేయాలని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు సర్కులర్ కాపీలను పంపించారు.జర్నలిస్టుల పిల్లలకు ప్రయోజనం చేకూరే విధంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తక్షణమే స్పందించిన జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు జారీ చేసిన ఫీజు రాయితీ సర్క్యులర్ కాపీలను ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబుకు అందజేశారు.

జిల్లాలోని జర్నలిస్టు మిత్రులు సర్కులర్ కాపీలను ఆయా విద్యాసంస్థల యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి ఫీజు రాయితీని పొందాలని టి యు డబ్ల్యూ జే (టీజేఎఫ్) జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.