27-06-2025 09:57:39 AM
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి(Peddapalli) మండలం రాఘవాపూర్ రైల్వే స్టేషన్లలో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు(Bhagyanagar Express Train) మూడు గంటలపాటు నిలిచిపోయింది. సిర్పూర్ కాగజ్ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ ఉదయం 6.30 ల నుండి సుమారు 3 గంటలకుపైగా రాఘవాపూర్ రైల్వే స్టేషన్ లో నిలిచిపోవడంతో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లిలో రైల్వే ప్లై ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్న నేపద్యంలో రైలును నిలిపివేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.