calender_icon.png 27 June, 2025 | 2:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సిందే

27-06-2025 11:08:10 AM

జర్నలిస్టుల ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలిపిన ప్రెస్ క్లబ్ 

అందరి సమస్యలు తెలిపే జర్నలిస్టు సమస్య ఎవరు పరిష్కరించాలి

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉందని ప్రధాన పత్రికల  బ్యూరో లు టీవీ ఛానల్ ల  బ్యూరోలు, సోషల్ మీడియా జర్నలిస్టులు, సంఘీభావం తెలిపారు. అదేవిధంగా మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్(Mahabubnagar Press Club) సభ్యులు కూడా దీక్షా శిబిరానికి చేరుకొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత నాలుగు రోజులుగా జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం ముందు జర్నలిస్టులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి సమస్యను తమ సమస్యగా భావించి పరిష్కార మార్గం చూపేలా ప్రచురితం చేసి శ్రమిస్తున్న జర్నలిస్టుల సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి జర్నలిస్టు వృత్తిలో పనిచేస్తున్న వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడియోలను కోరారు. ప్రతి జర్నలిస్టుకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న జర్నలిస్టులను ఎందుకు నిర్లక్ష్యంగా చూస్తున్నారని, అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టుల డిమాండ్లను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కోరారు.

ఈ  కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మొహమ్మద్ రఫీ, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్, మైత్రి యాదయ్య,  ఉమామహేశ్వరరావు, సాక్షి బ్యూరో ఇంచార్జ్ కిషోర్ గౌడ్, ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచార్జ్ రవీందర్ రెడ్డి, సూర్య దినపత్రిక బ్యూరో ఇన్చార్జ్ వరంగల్ శివకుమార్, వెలుగు బ్యూరో ఇన్చార్జ్ అక్కల  ధరణి , ఉర్దూ మీడియా ప్రతినిధులు అహద్ షాబుద్దీన్, జాఫర్, కార్యదర్శి గోపాల్, జర్నలిస్టు ప్రతినిధులు పసుపుల శ్రీనివాస్, కటిక రవీందర్, జక్కా గోపాల్ , ఎస్ నైన్ సీఈవో గోపాలకృష్ణ , పల్లె మౌని  యాదయ్య, రామకృష్ణ ,అరగిద్ద అనిల్ కుమార్. బాలు , కాడం రాఘవేందర్, దిలీప్ కుమార్ , రామ్ కొండ , మోహన్ దాస్, భాస్కరాచారి, సతీష్ కుమార్, రవి, రవీందర్ గౌడ్ , సత్య ప్రకాష్ , ఎటుకాడి ప్రభాకర్ .. ఉర్దూ జర్నలిస్టు కూడా ప్రతినిధులు .ప్రజా సంఘాల నాయకులు  సిపిఐ జిల్లా కార్యదర్శి బాలకిషన్ , రాము, మాల చైతన్య సంఘం మూలె కేశవులు, తదితరులు పాల్గొన్నారు.