26-07-2025 12:00:00 AM
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
నిజామాబాద్, జూలై 25 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలోబాధిత మహిళలకు, పిల్లలకు సహయం మెరుగైన సేవలు అందిస్తూన్నా భరోసా కేంద్రం అండగా ఇస్తుందని సిపి సాయి చైతన్య అన్నారు. ఇందులో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కార్యాలయం లో భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో రేప్ కేసులలో ఏడు మంది బాధిత పిల్లలకు మహిళలకు భరోసా కేంద్రంతరపున చెక్కులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ భరోసా కేంద్రం ద్వారా మహిళలకు మనోధైర్యం, న్యాయం అందించడం పోలీస్ శాఖ యొక్క ముఖ్య లక్ష్యాల ప్రాణమైనదని అన్నారు. ఈ రోజు బాధిత మహిళలకు పిల్లలకు ఆర్ధిక సాయం కోసం భరోసా కేంద్రం తరపున చెక్కులు అందజేయడం ద్వారా వారి పునర్వాసానికి తోడ్పాటు అందించినందుకు ఆయన సంతృప్తి చేశారు.
ప్రతీ మహిళాలు పిల్లలు భద్రతగా, గౌరవంగా జీవించాలన్నదే మా అభిలాష భరోసా కేంద్రం సేవలను మరింత విస్తరించి, బాధి-తుల కోసం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాం అని సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) శ్రీ బస్వారెడ్డి, భరోసా సెంటర్ కో-ఆర్డినేటర్ జి. రోజా, లీగల్ అడ్వయిజర్ డయాణ గీతిక మహిళా పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పుష్పావత, మౌనిక, సవిత, ఎ.ఎన్.ఎమ్లు తదితరులు పాల్గొన్నారు.