18-06-2025 05:57:19 PM
ఆర్డీవో..
వలిగొండ (విజయక్రాంతి): రైతుల భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతిని తీసుకువచ్చిందని ఆర్డీవో అన్నారు. బుధవారం వలిగొండ మండల కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నో ఏండ్లుగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతిని తీసుకువచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా రైతులు అందించిన పలు దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ప్రతి దరఖాస్తును నమోదు చేసి రసీదును అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దశరథ, ఎంఆర్ఐ కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మనోహర్, జూనియర్ అసిస్టెంట్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.