calender_icon.png 4 June, 2025 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 4 నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

02-06-2025 05:29:11 PM

తహసీల్దార్ సతీష్ కుమార్...

మందమర్రి (విజయక్రాంతి): మండల పరిధిలోని రైతుల సౌకర్యార్థం ఈ నెల 4వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మండల తహసిల్దార్ పీ సతీష్ కుమార్(Mandal Tehsildar Satish Kumar) తెలిపారు. మండల తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.  మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తమ భూములకు సంబంధించిన సమస్యలను  భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. 

ఈ నెల 4న పొన్నారం, చిర్రకుంట గ్రామపంచాయతీ కార్యాలయంలలో, 6న వెంకటాపూర్, మామిడిగట్టు గ్రామపంచాయతీ కార్యాలయంలో, 10న లేమూరు, సారంగపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో, 12న క్యాతనపల్లి ప్రాథమిక పాఠశాలలో, తిమ్మాపూర్ పరిధిలోని బొక్కలగుట్ట రైతు వేదికలో, 16న అమరవాది ప్రాథమిక పాఠశాలలో, అందుగుల పేట గ్రామపంచాయతీ కార్యాలయంలో, 18న మందమర్రి(వి) ప్రాథమిక పాఠశాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను  సద్వినియోగం చేసుకొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.