calender_icon.png 4 June, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలి

02-06-2025 05:32:16 PM

మంత్రికి సీతక్కకు వినతి పత్రం..

మహబూబాబాద్ (విజయక్రాంతి): ములుగు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మహబూబాబాద్ జిల్లాలో ఉన్న కొత్తగూడ, గంగారం మండలాల్లోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగుపరచాలని మంత్రి సీతక్క(Minister Seethakka)కు తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(Telangana People Joint Action Committee) ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం స్టేట్ కో కన్వీనర్ మైస శ్రీనివాసులు మాట్లాడుతూ... మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేక పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని పేర్కొన్నారు.

ఆయా మండలాల్లో తమ సంఘం ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి పాఠశాల వారీగా నెలకొన్న సమస్యలపై నివేదిక రూపొందించామని చెప్పారు. అనేక పాఠశాలలో మరుగుదొడ్లు మూత్రశాలలు, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాల్ లేవన్నారు. పలుచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయన్నారు. పాఠశాలలకు సంబంధించిన సమస్యలతో కూడిన నివేదికను మంత్రికి అందజేసి సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.