6 July, 2026 | 9:16 PM

Breaking News

ప్రభుత్వ ధాన్యాన్ని దోచుకునే వారిపై ఉక్కుపాదం..   •   ఈ మురికి కాలువ శుభ్రం చేయరా..?   •   ఎంపీడీవో కార్యాలయంలో భయం భయం   •   రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •  

రైతులకు పెద్దపీట

20-03-2025 02:17 AM

కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో రైతులకు పెద్ద పీట వేసింది. రైతుల రుణ మాఫీ కోసం రూ. 20,616 కోట్లు కేటాయించడంతోపాటు రైతు భరోసా కింద ఎకరాకు రూ. 12,000 చెల్లించేందుకు బడ్జెట్ రూ. 18000 కోట్లు కేటాయించడం అభినందనీయం.

ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సన్న ధాన్యానికి క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇచ్చేందుకు వడ్ల బోనస్ కింద రూ. 1206 కోట్ల చెల్లించేందుకు డబ్బులు కేటాయించడంతోపాటు రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాల సంఖ్యను 8,332కు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం హర్షనియం. అంతేకాకుండా అయిల్ ఫామ్ సాగుకు టన్నుకు రూ.2000 సబ్సిడీ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం, పంటల సాగు కోసం తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు ఎంతో ఉపయోగపడనున్నాయి.

  పంచర్పుల వెంకటేష్