12 March, 2026 | 10:52 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

జగ్గయ్యపేట ఎమ్మెల్యేను కలిసిన బిక్కుమల్ల

19-10-2025 06:19 PM

ములకలపల్లి (విజయక్రాంతి): పాల్వంచలోని సుగుణ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యని జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకులు, ములకలపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు బిక్కుమల్ల సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి విజయానికి కృషి చేయాల్సిందిగా తనకు సూచించారని బిక్కుమల్ల సుధాకర్ ఇక్కడ విలేకరులకు తెలిపారు.