16-06-2025 02:06:06 AM
- అంగన్వాడీ కేంద్రాలకు అందని సరుకులు
- మే నెలలో సరఫరా కాని కందిపప్పు
- జూన్ నెల సగమైనా అందని గుడ్లు
- ఉన్నతాధికారుల ఆదేశాలు ఆచరణలో శూన్యం
భద్రాద్రి కొత్తగూడెం,జూన్ 15 (విజయ క్రాంతి); అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, యుక్త వ యస బాలికలకు పౌష్టికాహారాన్ని అందించు ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలంటూ రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆచరణ శూన్యం అని చెప్పగా తప్పదు.
జిల్లాలో అధికారుల పనితీరు భిన్నంగా ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో అమ్మ మాట... అంగన్వాడి బాట పేరుతో ఈనెల 10వ తేదీ నుం చి ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర జిల్లా అధికారులు ఆదేశించిన విషయం విదతమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్ర మంగా నిర్వహిస్తున్న అమ్మ మాట అంగన్వాడీ బాటలో చిన్నారులకు ఎగ్ బిర్యానీ తో ఆహారం పెట్టాలని వారంతా అంగనవాడే కేంద్రాలకు ఉత్సాహంగా ఆకర్షించేలా చర్య లు చేపట్టాలని మంత్రులు, ఉన్నతాధికారు లు అంగన్వాడీ టీచర్లను ఆదేశించిన విష యం వెదటమే.
చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు ఆకర్షించాలనేదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఉద్దేశం బాగున్నప్పటికీ అమలు ఆచరణ సాధ్యంగా ఉంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆచరణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మే నెలలో వేసవి దృష్ట్యా కేంద్రాలకు సెలవు ప్రకటించినప్పటికీ, నిత్యవసర సరుకులను లబ్ధిదారు లకు అందించాల్సి ఉంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 11 ప్రాజెక్టులలో మే నెలలో కందిపప్పు సరఫరా జరిగిన దాఖలాలు లేవని తెలుస్తోంది. జూన్ నెల 1వ తేదీ నుంచి కేంద్రాల ప్రారంభమై 15 రోజులు గడిచిన జిల్లా వ్యా ప్తంగా కోడిగుడ్ల సరఫరా మాత్రం జరిగినట్లు లేదు.
గుడ్లుంటే పాలు ఉండవు, పా లుంటే పప్పు ఉండదు అన్న చందాన ఉంది అంగన్వాడి కేంద్రాల పరిస్థితి. వాటిని పర్యవేక్షించి ప్రతినిత్యం లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం, కందిపప్పు, నూనె, పాలు, గ్రుడ్డు సక్రమం గా సరఫరా జరిగేలా చూడాల్సిన పర్యవేక్షణాధికారులు, పర్సంటేజీల మత్తులో నిమగ్నమై సరఫరాను గాలికి వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ కేంద్రంలోకి వెళ్ళిన గుడ్లు రాలేదని, పాలు సరఫరా చేయలేదని, కందిపప్పు కనిపించడం లేదని చెప్పడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధం గా ఉంటే చిన్నారులకు గర్భిణీలకు పోషకాహారం అందని దుస్థితి నెలకొని ఉం ది.
ప్రతి నెల అంగనవాడే టీచర్ల నుంచి జి ల్లా స్థాయి అధికారులు ఏఏ అంగన్వాడి కేంద్రాల్లో ఏ ఏ ఆహార పదార్థాలు ఎంత మే రకు ఉన్నా యి, నిలవల వివరాలు సేకరిస్తు న్న అధికారులు కనీసం నిత్యవసర సరుకులు సరఫరా చేయించే పరిస్థితిని పట్టించు కోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పక తప్పదు. ఈ కారణంగా జిల్లాలో అమ్మ మాట అంగన్వాడి బాట అరకొరగా సాగు తోందనే తెలుస్తోంది. కేంద్రాల కు వచ్చిన లబ్ధిదారులు పాలు కందిపప్పు మం చి నూనె లేదని చెప్పడంతో టీచర్లను నిలదీస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పరిస్థితిని ఉన్నతాధికారులకు విన్నవించామని సరఫరా కాగానే అందిస్తామని టీచర్లు నచ్చజెప్పి పంపించే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఏ ర్పడిందని వస్తోంది.
కొన్నిచోట్ల తమకు ఇవ్వాల్సిన వస్తువులను టీచర్లు అమ్ముకుంటున్నారనే అనుమానంతో స్థానికులు గొడ వ పడడం జరుగుతుందని అంగన్వాడీ టీచ ర్లు వాపోతున్నారు. జిల్లాలోని ఏ దుస్థితిపై ఉన్నతాధి కారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి నెల సక్రమంగా సరుకులు సరఫరా జరిగేలా చూడాలని అంగన్వాడీ లబ్ధిదారులు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మాతా శిశు సంక్షేమ శాఖ అధికారులను వివరణ కోరగా హైదరాబాద్ స్థాయిలోనే టెండర్లు నిర్వహిస్తున్నారని, టెం డర్ల నిర్వహణలో జాప్యం కారణంగానే సరుకుల సరఫరా జరగలేదన్నారు.